March 20, 2013

స్వాగత ఏర్పాట్లలో నేతలు

చంద్రబాబు పాదయాత్రకు టీడీపీ నేతలు స్వాగత ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు రోడ్‌కమ్ రైలు బ్రిడ్జి వద్దకు చేరుకుని భారీ ఎత్తున ఆయనకు స్వాగతం పలకాలని నేతలు సన్నాహాలు చేసుకున్నారు. రాజమండ్రి పార్లమెంట్ ఇన్‌ఛార్జి మురళీమోహన్, పాలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా అధ్యక్షుడు చినరాజప్ప, ఎమ్మెల్యేలు చందన రమేష్, పెందుర్తి వెంకటేష్, పర్వత చిట్టిబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, నాయకులు గన్ని కృష్ణ, వర్మ తదితరులు చంద్రబాబుకు స్వాగతం చెప్పనున్నారు.