March 26, 2013
ఉగాది నుంచి బాబు యాత్ర
పదిన కొత్త అమావాస్య కావడంతో విశాఖ జిల్లాలో నూకాంబిక పండుగ జరుపుకుంటారు. దీంతో ఆ రోజు చంద్రబాబు కోటనందూరులోనే వుంటారు. పదకొండు ఉగాదిన ఉదయం పంచాంగం శ్రవణం, ఉగాది వేడుకలు నిర్వహించిన అనంతరం అదే రోజు సాయంత్రం విశాఖ జిల్లా గన్నవరం మెట్టలోనికి అడుగిడతారు. అక్కడ నుంచి 27 వరకు ఇప్పటికే ఖరారుచేసిన రూటు మేరకు పాదయాత్ర వుంటుందని రత్నాకర్ తెలిపారు. రూటులో ఆదివారాలు కూడా నడుస్తారని తెలిపారు. వచ్చేనెల 27న కచ్చితంగా ముగింపుసభ వుంటుందని వివరించారు. ముగింపుసభ వేదిక ఖరారుపై ఒకటి రెండురోజుల్లో ఖరారుచేస్తామని తెలిపారు.
Posted by
arjun
at
6:26 AM