March 26, 2013

2500 కిలోమీటర్ల సరికొత్త రికార్డు

175రోజులు మండపేట కలువ పువ్వు సెంటర్‌కు చేరుకునేటప్పటికీ 2500 కిలోమీటర్లు. ఇది రాష్ట్ర చరిత్ర లో సరికొత్త రికార్డు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. చిరంజీవి మోజులోపడి టీడీపీని వీడి వెళ్లిన కాపు సోదరులు సొంతింటి కి సగర్వంగా రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కాపు నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.