March 26, 2013
తల్లి,పిల్ల కాంగ్రెస్లను తరిమికొట్టండి
పుత్తూరు: అవినీతిమయమైపోయిన తల్లి,
పిల్ల కాంగ్రెస్లను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని తెలుగుదేశం పార్టీ
జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.చంద్రబాబు
పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ పుత్తూరులో బహిరంగ
సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రూ.లక్షల కోట్లు ప్రజాధనం
కొల్లగొట్టిన కాంగ్రెస్ నాయకులు చివరకు జైలుశిక్ష అనుభవిస్తున్నారని
విమర్శిం చారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలోని యూపీఏ
ప్రభుత్వం రోజుకో కుంభకోణంలో కూరుకుపోతుండగా వైఎస్ హయాంలో లక్ష కోట్లు
భోంచేసిన ఆయన కుమారుడు జగన్ జైలు పాలయ్యాడని గుర్తు చేశారు. తాను ఏ
పార్టీలో ఉన్నా 30 ఏళ్లుగా తనను ఆదరిస్తూ వచ్చిన పుత్తూరు, నగరి ప్రజలకు
జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మె ల్యే ముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు.
అందుకోసమే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నగరి, పుత్తూరులను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని తెలిపారు.అనంతరం కాంగ్రెస్ నాయకుడు గాలి జీవరత్నం నాయుడు సుమారు వెయ్యి మంది కార్యకర్తలతో కలసి తెలుగుదేశం పార్టీలో చేరారు.అంతకుముందు ఆరేటమ్మ ఆలయం నుంచి కార్వేటినగరం రోడ్డు మీదుగా అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలో చేరిన వారిలో మధు, కె.శివ, ఐఎన్టీయూసీ ఆర్టీసీ యూనియన్ నాయకుడు టి.సత్యనారాయణ తదితరులున్నారు.
టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీధర్వర్మ, ఉపాధ్యక్షుడు మదనపల్లి మధుబాబు, ఎమ్మెల్యే తనయుడు గాలి జగదీష్, పాకారాజ, ఎస్.ఎన్.మాధవ, బి.జీవాశేఖర్,తంగరాజ్,సి.ఎస్.బాబు, డి.ఎస్.గణేష్, ఎ.డి.కిష్టప్ప,జానా వెంకటయ్య, దేవానందమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
6:07 AM