March 26, 2013
రైతులు రుణాలు కట్టొద్దు..విద్యుత్ బిల్లులు చెల్లించొద్దు
ప్రజలకు మద్దతుగా ని లిచేందుకు ప్రజా సమస్యల్లో భాగస్వాములు అయ్యేందుకు బోధన్ నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. టీడీపీ శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బుద్దెరాజేశ్వర్, గోపాల్రెడ్డి, వెంకటేశ్వరరావు దేశాయ్, ఖలీల్, బండారుపొశెట్టి తదితరులు పాల్గొన్నారు.
29 నుంచి పల్లెపల్లెకు తెలుగుదేశం బోధన్ నియోజకవర్గంలో ఈనెల 29న పార్టీ ఆవిర్బావదినోత్సవం నుంచి పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అమర్నాథ్బాబు పేర్కొన్నారు.
నవీపేట మండలంలోని కమలాపూర్, లక్ష్మీకిసాన్ ఫారాల్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ లుంటాయన్నారు. మార్చి 29,30వ తేదీల్లో నవీపేట మండలంలో మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీన బోధన్ పట్టణంలో ఏప్రిల్ 7,8వ తేదీల్లో బోధన్ మండలంలో, ఏప్రిల్ 9,10 తేదీల్లో ఎడపల్లి మండలంలో.13,14వ తేదీల్లో రెంజల్ మండలాల్లో పల్లెపల్లెకు కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
Posted by
arjun
at
6:22 AM