March 22, 2013

అసెంబ్లీ వాయిదాపై టీడీపీ నిరసన

హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు శనివారం నాటికి వాయిదా వేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సభ వాయిదా పడినప్పటికీ సభలోనే బైఠాయించి నిరసన తెలిపారు. సభను ఎలా వాయిదా వేస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించారు.

మరోవైపు సభలో ఎలాంటి చర్చలు జరపకుండా వాయిదా వేసుకుంటూపోతే ప్రజాధనం వృథా అవుతుందని, అసలు ప్రజాసమస్యలపై ఇంకెప్పుడు చర్చిస్తారని సీపీఎం, టీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రశ్నించారు.