March 22, 2013

ప్రభుత్వానికి ముందుచూపు లేకనే విద్యుత్ కోతలు : తలసాని

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకనే రాష్ట్రంలో విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగాయని టీడీపీ నేత తలసాని శ్రీనివాస యాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకునే రేపు(శనివారం) విద్యుత్ సౌధను ముట్టడించనున్నట్లు తలసాని తెలిపారు.