March 22, 2013
ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం : కోడెల
గుంటూరు: సహకార ఎన్నికల్లో వలే స్థానిక సంస్థల
ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు తెర లేపిందని తెలుగుదేశం పార్టీ
అధికార ప్రతినిధి కోడెల శివప్రసాద రావు ఆరోపించారు. శుక్రవారం గుంటూరులో
ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కొనే సత్తా లేని
కాంగ్రెస్ పార్టీ ఓటర్ జాబితాల్లో అక్రమంగా చేర్పులను చేపడుతున్నదన్నారు.
నరసరావుపేటలోని ఓటర్లను తీసుకెళ్లి టీడీపీకి పట్టు ఉన్న గ్రామాల్లో
ప్రభుత్వం చేర్చిందన్నారు. దానివల్ల రెండుచోట్ల కాంగ్రెస్ వారు ఓట్లు
వేయడానికి కలుగుతుందన్నారు. ఈ అక్రమాలను సవరించకపోతే ప్రభుత్వంపై
రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Posted by
arjun
at
11:12 PM