March 22, 2013

కార్యకర్తలకు అండగా ఉంటా

బుక్కరాయసముద్రం : 'టీడీపీ ఓ కుటుంబం లాంటిది. కుటుంబమన్నా క మనస్పర్థలు, విభేదాలు సహజం. పార్టీలో ఉన్న కార్యకర్తలకు తల్లిలాం టిదాన్ని అందరికి అండగా ఉంటా' అని ఎమ్మెల్సీ శమంతక మణి భాగోద్వేగంతో మాట్లాడారు. గురువారం మం డల కేంద్రంలోని రామస్వామి దేవాలయంలో మండల టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీతోపాటు ఆలం నరసానాయుడు హాజరయ్యారు. మండలంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు సహకార సొసైటీ ఎన్నికల నుంచి శమంతకమణితో దూరంగా ఉన్నారు. ఇటీవలే కాల్వ శ్రీనివాసులు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసార«థి, ఆలం నరసానాయుడు మండల టీడీపీ నేతలతో మా ట్లాడి, విభేదాలు వీడి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని వారికి సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నియోజకవర్గం ఇన్‌చార్జ్ శమంతకమణికి ఎ మ్మెల్సీ పదవి ఇవ్వగా బుధవారం జరిగిన స్వాగత కార్యక్రమానికి మండలం నుంచి పలువురు టీడీపీ కార్యకర్తలు హాజరుకాలేదు.

దీంతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ శమంతకమణి స్వ యంగా సమావేశం ఏర్పాటు చేసి మండల టీడీపీ కార్యకర్తలతో, నాయకులతో విడివిడిగా మాట్లాడారు. సహకార సొసైటీ ఎన్నికల్లో తన ప్రమేయం ఏమీ లేదంటూ కార్యకర్తలకు తెలిపా రు. చెన్నంపల్లి-2 డైరెక్టర్ ఫిరాయించి న విషయంలో తనకు ఎలాంటి సం బంధం లేదని ఆ రోజు పార్టీ టెలీకాన్ఫరెన్స్ జరుగుతున్నందు వల్ల మీ ఫోన్ అందుబాటులోకి రాలేకపోయిందని అందుకు క్షమించాలని వేడుకున్నారు. సహకార సొసైటీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించడానికి సహకరించిన టీడీపీ నేతలు చెన్నంపల్లి మల్లికార్జున రెడ్డి, సుబ్బారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు కార్యకర్తల సమావేశంలోనే ప్రకటించారు.

ఇకపై మండలంలో ఏ కార్యకర్తకీ కష్టమొచ్చినా తానుంటానని ఆమె వెల్లడించారు. గతంలో జరిగిన సంఘటనను మరచిపోయి ఒక తల్లిలా ఆదరించాలని కార్యకర్తలను వేడుకున్నా రు. ఈ నెల 31న జరిగే ప్రమాణ స్వీ కారోత్సవం కార్యక్రమానికి మండలం నుంచి భారీగా తరలిరావాలని మం డల నేతలకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్కే వెంకటేశులు, మండల కన్వీనర్ అశోక్‌కుమార్, జిల్లా టీడీపీ నేతలు జొన్నారామయ్య, కేశ న్న, మాజీ సర్పంచ్‌లు లక్ష్మినారాయణ, రమేష్, లింగారెడ్డి, నారాయణస్వామి టీడీపీ నేతలు ఓబుళపతి, చెరుకూరు నారాయణస్వామి, వెంకటేష్, రామాంజినేయులు, ఆదినారాయణ, సన్నీ, సిద్దారెడ్డి, సోమశేఖర్, పరిసే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.