March 22, 2013

టీడీపీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ


బంట్వారం:వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి రైతులకు రుణమాఫీ చేస్తుందని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జి.సుభాష్‌యాదవ్ అన్నారు. టీడీపీ నిర్వహించనున్న పల్లె పల్లెకు టీడీపీ కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఒరిగిందీ ఏమీ లేదన్నారు.