March 22, 2013

రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా మురళీమోహన్


రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అ ధ్యక్షుడు చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రలోనే పలు చోట్ల అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలకు ఆయన ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను పరోక్షంగా ప్రకటించారు. రాజమండ్రికి ప్రము ఖ సినీ నటుడు మాగంటి మురళీమోహన్ ఇప్పటికే ప్రజల్లో పనిచేస్తుండగా, రాజమండ్రిలో గురువారం జరిగిన పి.గన్నవరం, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ కా ర్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును అమలాపురం లోక్‌సభ ఇన్‌చార్జిగా నియమించినట్లు ప్రకటించారు. అంతేకాక ఈయనే అభ్యర్థి అని ప్రకటించారు.

సూర్యారావు మాజీ మంత్రిగా అనుభవం ఉండడమే కాక పలుకుబడి, సమర్థత ఉన్న నాయకుడని ఇక లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇన్‌చార్జిలను కలుపుకుని మంచి ఫలితాలు సాధించాలన్నారు. బాలయోగిలా పనిచేయాలని తనకు బాలయోగి అంటే ఏమిటో తెలుసునని అదేవిధంగా ధైర్యంగా పనిచేయాలని సూర్యారావుకు ఆయన సూచించారు. స మావేశంలో పొటిట్‌బ్యూరో సభ్యుడు య నమల రామకృష్ణుడు, మురళీమోహన్, గో రంట్ల బుచ్చయ్యచౌదరి, మెట్ల సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు, చిక్కాల రా మచంద్రరావు, నిమ్మకాయల చినరాజప్ప, గన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.