March 22, 2013

నేనేమి చేయాలి.. మీరేమి చేయాలి

రాజమండ్రి: చంద్రబాబునాయుడు రాజమం డ్రి కంబాలచెరువు సెంటర్‌లో ప్రసంగించే సమయంలో పలువురు ప్రభుత్వం తీరువల్ల ఇబ్బందు లు పడుతున్నామని చెప్పగా తానేమి చేయాలో.. మీరేమి చేయాలో చెప్పండి అని అడిగారు. దీంతో ప్రజలు స్పందిస్తూ కాంగ్రెస్‌ను గద్దెదించి తెలుగుదేశంను అధికారంలోకి తెస్తామన్నారు. మరో మహిళ మాట్లాడుతూ ఇవాళ బియ్యం బస్తా రూ.1100 అయిందని తాము బతకడం కష్టమైపోయిందని చెప్పారు. రూ.5,6 వేల జీతంతో సామాన్యులకు బతుకు భారంగా పరిణమించిందని, రాజమండ్రిలో పుట్టి పెరిగిన గజం స్థలం కూడాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ బాధపడడంకాదు పోరాడాలని, తెలుగుదేశానికి అండగా నిలబడాలని ప్రజల బతుకులు మారుస్తానని చెప్పారు.