July 4, 2013

పంచాయితీలను బలోపేతం చేయడానికే ప్రాంతీయ సదస్సులు : చంద్రబాబు

పంచాయితీ ఎన్నికల్లో మంచి నేతను ఎన్నుకుంటేనే పంచాయితీల రూపురేఖలు మారుతాయని, ఆదర్శగ్రామాలుగా అభివృద్ధి చెందుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం ఉదయం జిల్లాలో జరిగిన టీడీపీ రెండో ప్రాంతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాబు నేతలనుద్దేశించి ప్రసంగించారు. అవినీతిపరులను గ్రామాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే టీడీపీ పనిచేస్తోందని తెలిపారు. పంచాయితీలను బలోపేతం చేయడానికే ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.