July 4, 2013

విజయవాడ, గుంటూరును మెగాసిటీ..

విజయవాడలో టీడీపీ ప్రాంతీయ సదస్సు
విజయవాడ : విజయవాడలో జరుగుతున్న టీడీపీ ప్రాంతీయ సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వైఎస్‌తో ప్రారంభమైన అవినీతి ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. మచిలీపట్నం, రేపల్లె రైల్వే లైను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ, గుంటూరును మెగాసిటీగా మారుస్తామన్నారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటుచేస్తామన్నారు. నిజాంపట్నం, రామాయపట్నం పోర్టులను అభివృద్ధి చేస్తామన్నారు. అధికారం లోకి మామీద కోపం ప్రాజెక్టులపై చూపిస్తున్నారన్నారు. కొల్లేరు వాసులను న్యాయం జరిగేంతవరకూ అండగా ఉంటానని బాబు హామీ ఇచ్చారు. బందరు పోర్టును ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.