July 4, 2013
తల్లి, పిల్ల కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి : పయ్యావుల
పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్
కలిసి పోటీచేసే పరిస్థితి కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే
పయ్యావుల కేశవ్ అన్నారు.తిరుపతిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన
ప్రాంతీయ సమవేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి
పంచాయతీ ఎన్నికలలో పూర్వ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక
చోట్ల ఇప్పటికే తల్లి కాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్ కలిసి పని చేసే సూచనలు
ఉన్నాయని ఆయన అన్నారు.సమర్ధపాలన,స్వచ్చమైన పాలన ఒకవైపు, అవినీతి అసమర్ధ
పాలన మరో వైపు వీటి మధ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులనే ఎంపిక
చేసుకోవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని కేశవ్ అన్నారు.
Posted by
arjun
at
11:53 PM