July 4, 2013

రాజమండ్రిలో నేతలతో ముచ్చటించిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రిలోని లాలాచెరువు సెంటర్ వద్ద నేతలతో ముచ్చటించారు. గురువారం ఉదయం విశాఖపట్నం నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో వెళ్తున్న చంద్రబాబుకు రాజమండ్రిలో నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేతలతో ముచ్చటించిన బాబు స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు.