July 4, 2013

పీఏసీ ఛైర్మన్‌గా కేఈ కృష్ణమూర్తి నియామకం

హైదరాబాద్: ప్రజా ఖాతాల సంఘం(పీఏసీ)కు కొత్త ఛైర్మన్ నియమితులయ్యారు. ప్రతిపక్ష టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తిని పీఏసీ ఛైర్మన్‌గా ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నియమించారు. ప్రస్తుతం పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న రేవూరి ప్రకాష్‌రెడ్డిని చంద్రబాబు ఇటీవలే రాజీనామా చేయించారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున చంద్రబాబుపై కేఈ ఒత్తిడి తేవడంతోనే రేవూరిని బాబు రాజీనామా చేయించినట్లు వార్తలొచ్చాయి. ఒత్తిడి కారణంగానే కేఈ పేరును ప్రతిపాదిస్తూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. పీఏసీ ఛైర్మన్‌గా కేఈ ప్రమాణం చేయనున్నారు. కాగా, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతను పీఏసీ ఛైర్మన్‌గా నియమించడం అనవాయితీగా వస్తోంది.