July 4, 2013
కోలాహలంగా కేశినేని కార్యాలయం ప్రారంభం
భారీగా అభిమానులు హాజరు
(విజయవాడ,కెఎన్ఎన్ బ్యూరో) : తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు
నియోజకవర్గ ఇన్ చార్జి కేశినేనినాని స్థానిక పాత బస్స్టాండ్ వద్ద
విజయవాడ లోక్సభ టీడీపీ పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధినేత
చంద్రబాబునాయుడు గురువారం రాత్రి ప్రారంభించారు. టీడీపీ
కార్యకర్తలు,నాయకులు, కేశినేని అభిమానులు పెద్ద సంఖ్యలో
హాజరుఅయ్యారు.పార్టీ నేతలతో వివిధ ప్రాంతాలకు చెందిన వర్తక వాణిజ్యవర్గాలకు
చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. రవాణ రంగానికి చెందిన అనేకమంది వ్యాపారులు
తరలి వచ్చారు. వివిధ ప్రాంతాలనుంచి మహిళా కార్యకర్తలు భారీగా హాజరు
అయ్యారు. మూడు అంతస్తుల భవనం నిర్మించగా మొదటి అంతస్తులో సమావేశాలకు
అనుగుణంగా ఏర్పాటుచేశారు. చంద్రబాబు నాయుడుపార్టీలోని అన్ని అంతస్తులు
తిరిగి పరిశీలించారు. భవనం నిర్మాణ వివరాలను కేశినేని చంద్రబాబుకు
వివరించారు. ఈ కార్య క్రమంలో ఎంపీ కొనకళ్ల నారాయణతో పాటు తంగిరాల
ప్రభాకరరావు, శ్రీరాం తాతయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శులు వర్ల రామయ్య,
గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాగిత వెంకట్రావు, బొండా ఉమా,అంబికా కృష్ణ, మాగంటి
బాబు, లాల్ జాన్ భాషా,పంచుమర్తి అనూరాధ,రావి వెంకటేశ్వరరావు, సిఎల్
వెంకట్రావు, నగర అద్యక్షులు నాగుల్ మీరా, పశ్చిమ ఇన్ చార్జి బుద్దా
వెంకన్న, తూర్పు ఇన్ చార్జి గద్దె రామమోహనరావు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ
రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
Posted by
arjun
at
11:54 PM