April 16, 2013

ఖనిజాలను దోచుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు


విశాఖపట్నం: బినామీ పేర్లతో కాంగ్రెస్ పెద్దలు లాటరైట్, బాక్సైట్ వంటి ఖనిజాలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. నాతవరం మండలం తాండవ జంక్షన్‌లో జరిగిన భారీ సభలో సోమవారం రాత్రి ఆయన మాట్లాడుతూ, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌తోపాటు నాతవరం మండలంలో లాటరైట్ ఖనిజాన్ని బినామీపేర్లతో లైసెన్స్‌లు పొందేందుకు కాంగ్రెస్ నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు.

కేవలం బెల్టుషాపుల్లో పనిచేసేవారినే ఆదర్శ రైతులుగా నియమించారని, ఫలితంగా రైతులకు ఎటువంటి వ్యవసాయ సూచనలు అందడంలేదన్నారు. జీడిపరిశ్రమ ఆధారంగా పనిచేస్తున్న కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఒకప్పుడు లక్షాధికారులుగా మారిన డ్వాక్రా మహిళలను బిక్షాధికారులుగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థులందరికీ ఉచితంగా

నేడు బాబు పాదయాత్ర విశేషాలు చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితిని మరోసారి పరీక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఇద్దరు డాక్టర్లు బృందం మంగళవారం రానున్నది. సోమవారం రాత్రి బసచేసిన డి.ఎర్రవరం బీఈడీ కళాశాలలో డాక్టర్లు చంద్రబాబును పరీక్షించి పాదయాత్రపై సూచనలు చేసే అవకాశం ఉంది. కాగా మంగళవారం పాడేరు నియోజకవర్గ సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలు నుంచి డి.ఎర్రవరం నుంచి ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. సోమవారం కొంతమేర కాళ్లు బాధించినప్పటికీ సుమారు ఆరు కిలోమీటర్లు నడక పూర్తి చేసిన చంద్రబాబు, మంగళవారం పదికిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయాల్సి ఉంది.
సైకిళ్లు అందజేస్తామన్నారు. డబ్బు తిని బలిసిన కాంగ్రెస్ పార్టీ, ముందుకు వెళ్తే కుమ్మడం, వెనక్కి వస్తే తన్నడం చేస్తున్నదన్నారు.