April 16, 2013

మంత్రి జానారెడ్డిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : మంత్రి జానారెడ్డితో టీడీపీ ఎమ్మెల్యేలు రాములు, జైపాల్‌యాదవ్, రావుల చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. తమ నియోజకవర్గాల్లో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా నేతలు మంత్రికి వినతి చేశారు.