April 16, 2013
తెలుగుదేశంలోనే సుస్థిర పాలన
నల్లగొండ టౌన్ : రాష్ట్రంలో
సుస్థిరమైన, సమర్ధవంతమైన పాలన తెలుగుదేశంపార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని
పార్టీ రాష్ట్ర నాయకుడు కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం టీడీపీ
కార్యాలయంలో వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు కంచర్ల భూపాల్రెడ్డి
సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ
తొమ్మిది సంవత్సరాల పాలనలో ఏ ఒక్క కుంభకోణం లేకుండా చంద్రబాబు సమర్థవంతమైన
పాలన అందించారన్నారు.
పార్టీ లో చేరిన వారిలో వైసీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు సాయిచరణ్, రాజశేఖర్, శివ, చందు, గోపి, కిషన్, నగేష్, నేట్లు, నవదీప్, కిరణ్ న్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి బోయపల్లి కృష్ణారెడ్డి, బొర్రా సుధాకర్, వంగాల సహదేవ్రెడ్డి, మందడి సైదిరెడ్డి, పల్రెడ్డి రవీందర్రెడ్డి, పిల్లి రామరాజు, పిన్నపురెడ్డి మధుసూదన్రెడ్డి, ఆకునూరి పురుషోత్తం, మేడి శంకర్, కృష్ణారెడ్డి, మల్లేష్, రాంనర్సింహారెడ్డి, కంచర్ల శంకర్గౌడ్, మొబిన్, అలుగుబెల్లి కరుణాకర్రెడ్డి, జెర్రిపోతుల సతీష్గౌడ్, కొండా జానిగౌడ్, రాజేష్గౌడ్, మార్గం ఉపేందర్, సందీప్రెడ్డి, భరతసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
5:48 AM