April 13, 2013
జైలు సూపరింటెండెంట్ను తక్షణమే సస్పెండ్ చేయాలి: యనమల
సీఎం వత్తాసుతోనే జగన్కు జైళ్లశాఖ దాసోహం
హైదరాబాద్, : చంచల్గూడ జైలు వైసీపీ కార్యాలయంగా మారిందని
సాక్షాత్తు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారని.. దీనిపై ఏం సమాధానం
చెబుతారని జైళ్ళ శాఖ ఐజీని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. చంచల్గూడ
జైలు వైసీపీ కార్యాలయంగా మారిన వైనాన్ని తాము గతంలోనే బహిర్గతం చేశామని,
తమ లేఖల్లోని అంశాలు వాస్తవమేనని మంత్రి వ్యాఖ్యలు రుజువు చేశాయని
పేర్కొంది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు శనివారం ఒక ప్రకటన
విడుదల చేశారు. సీఎం వత్తాసుతోనే అధికారులు జగన్కు దాసోహమయ్యారని
ఆరోపించారు.
Posted by
arjun
at
11:08 PM