April 13, 2013

ఉద్విగ్న క్షణాలు


విశాఖపట్నం: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాలో 25 రోజుల పాదయాత్ర ముగించుకుని శుక్రవారం సాయంత్రం విశాఖ జిల్లాలో అడుగిడినప్పుడు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. చంద్రబాబు కాళ్లనొప్పులతో బాధపడుతున్నందున జిల్లాలో పాదయాత్ర వాయిదా పడుతుందంటూ శుక్రవారం ఉదయం నుంచి ప్రచారం జరిగింది.

హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం చంద్రబాబును పరీక్షించి పాదయాత్రను వాయిదా వేసుకోవాల్సిందిగా సూచించినప్పటికీ ఆయన తిరస్కరించారు. తనకోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విశాఖ జిల్లా ప్రజలు, పార్టీ నేతలను నిరుత్సాహపర్చడం ఇష్టం లేదంటూ చంద్రబాబు ఆరోగ్యం సహరించకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో పాదయాత్రను కొనసాగించారు. తమ జిల్లాలో 25 రోజులపాటు గడిపిన చంద్రబాబును తూర్పుగోదావరి జిల్లా నాయకులు యనమల రామకృష్ణుడు తదితరులు బరువెక్కిన హృదయంతో విశాఖ జిల్లా నేతలకు అప్పగించారు.

పర్యటనలో మార్పు


శుక్రవారం సాయంత్రం విశాఖ జిల్లా సరిహద్దుల్లో ప్రవేశించిన చంద్రబాబు పాదయాత్ర వాస్తవానికి నాతవరం మండలం డి.ఎర్రవరం వరకు కొనసాగాల్సి ఉంది. అయితే వైద్యుల సూచనల మేరకు పాదయాత్ర దూరాన్ని 12 కిలోమీటర్ల నుంచి ఆరు కిలోమీటర్లకు తగ్గించి అదే మండలంలోని శృంగ

పాదయాత్ర రెండు రోజులు వాయిదా

చంద్రబాబు కాళ్లనొప్పుల కారణంగా పాదయాత్రకు శని, ఆదివారాలు విరామం ఇచ్చారు. సోమవారం నుంచి ఆయన పాదయాత్ర పునఃప్రారంభం కానున్నది. అయితే ఆదివారం నర్సీపట్నంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్వగృహానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే తుది కార్యక్రమం శనివారం వెల్లడించే అవకాశం ఉంది.
వరం గ్రామంలో రాత్రిబస చేసేలా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. డి.ఎర్రవరం బదులు శృంగంవరం గ్రామ ప్రారంభంలో గల కొబ్బరితోటలో చంద్రబాబు రాత్రిబసకు ఏర్పాట్లు చేశారు.