April 13, 2013
గద్వాలకు పాకిన ఎన్టీఆర్ ప్లెక్సీల గొడవ
గద్వాలఅర్బన్ : తెలుగుదేశం
పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఫోటోతో కూడిన ఫ్లెక్సీలను వైసీపీ నా
యకులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఏర్పాటు చేయడం తెదేపాకు శిరోభారంగా
తయారైన విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ ఫ్లెక్సీల గొడవ గద్వాలను తాకడంతో రెండు
పార్టీల మధ్య ప్ర చ్ఛన్న యుద్ధం రాజేసింది. గురువా రం వైసీపీ నాయకుడు
షపీవుల్లా ఎన్టీ రామారావు, వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఫో టోల మధ్య వైసీపీ
అధ్యక్షుడు జగన్ ఫోటోతో పాటు స్థానిక నాయకుల ఫో టోలతో కూడిన ఫ్లెక్సీని
ఏర్పాటు చే యడం గద్వాల్లో చర్చనీయాంశమైం ది.
ఎన్టీ రామారావు చిత్రపటం, వైసీపీ నాయకుల పక్కన ఉండటాన్ని జీర్ణించుకోలేని స్థానిక తెదేపా కార్యకర్తలు శుక్రవారం మధ్యాహ్నం పాక్షికంగా దానిని చించివేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గద్వాలలో ఉద్రిక్తతలకు చోటు కల్పించేందుకే పథకం ప్రకారం విజయవాడ రాజకీయాలను గద్వాలలో రాణిస్తున్నారని వాపోతున్నారు. ఏది ఏమైనా ఏ పార్టీ పేరు లేకుండా ఫ్లెక్సీలను ఏ ర్పాటు చేయడం వైసీపీ నాయకులకే చె ల్లిందనిప్రజలుఅభిప్రాయపడుతున్నారు.
Posted by
arjun
at
8:39 AM