April 13, 2013

దళితుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి..

 రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళిత మహిళపై దాడి జ రిగి మూడు రోజులైనా ప్రభుత్వం ప ట్టించుకోకపోవడం శోచనీయమని తెదే పా జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర రాజ్‌పాల్‌కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్సీపేటలోని కమ్యూనిటీ హా లులో పట్టణ తెదేపా ఎస్సీసెల్ సమావేశం జరిగింది. సమావేశంలో ముం దుగా తెనాలిలో మానవ మృగాల చే తిలో అశువులు బాసిన దళిత మహి ళ బేతాల సునీల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అనంతరం రాజ్‌కుమార్ మా ట్లాడుతూ తెనాలి సంఘటనతో దళితు లు, దళితవాడలపై ప్రభుత్వానికి, పాలకులకు చిత్తశుద్ధి లేదని రుజువైందన్నా రు. సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రా తినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే సభ్యసమాజం సిగ్గు పడేలా ద ళిత మహిళలపై దాడి జరిగి మూడు రోజులు కావస్తున్నా నేటికీ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, స్పీకర్ కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం శోచనీయమన్నారు. దళితుల పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వానికి సబ్‌ప్లాన్ నిధులతో ప్రచా రం చేసుకునే నైతికహక్కు లేదని విమర్శించారు.

తెదేపా పట్టణ అధ్యక్షుడు ముస్తఫా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మా త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 123వ జ యంతిని తెదేపా ఆధ్వర్యంలో ఎస్సీపేటలోనే నిర్వహిస్తామని, తెదేపా అధినే త చంద్రబాబునాయుడు దళితుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ ప్రాముఖ్యతను దళితవాడలోనే వి నిపిస్తామన్నారు. తెదేపా మండల అధ్యక్షుడు దల్లి కృష్ణారెడ్డి మాట్లాడు తూ అంబేద్కర్ జయంతి రోజున వం ద మంది వృద్ధులకు చీరలు పంచడం, తెదేపా ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ ప్రా ముఖ్యతను వివరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నంబూరి రా మచంద్రరాజు, మద్దిపాటి నాగేశ్వరరా వు, పెసరగంటి జయరాజు, పాతూరి అంబేద్కర్, వెంపల రాజు, తోట కృ పావరం, కొత్తూరి సిద్ధయ్య, కొత్తూరి బోసుబాబు, కొత్తపల్లి వీర వెంకటేశ్వరరావు, కొత్తూరి రామయ్య, షేక్ యా కూబ్, మన్యం దుర్గారావు, పామర్తి రా మారావు, ముప్పిడి గంగరాజు, కొత్తూ రి గంగయ్య, తడికల ధర్మయ్య, గెద్దల శ్రీనివాసరావు, తలారి యుగంధర్, చి ట్టూరి బాలకృష్ణ పాల్గొన్నారు. అనంత రం ఆర్డీవో ఎన్‌వీవీ.సత్యనారాయణకు వినతి పత్రం అంజేశారు.

చట్టాలున్నా ఆగని అరాచకాలు..

మహి ళల రక్షణ కోసం ఎన్ని చట్టా లు పుట్టుకొస్తున్నా వారిపై అరాచకాలు మాత్రం ఆగడం లేదని మహిళా చైత న్య సమాఖ్య కన్వీనర్ కాసర లక్ష్మీసరోజారెడ్డి అన్నారు. శుక్రవారం సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం లో లక్ష్మీసరోజారెడ్డి మాట్లాడుతూ ఇ టీవల పలు ప్రాంతాల్లో మహిళలపై జ రుగుతున్న దాడులు సభ్యసమాజం సి గ్గుపడేలా ఉన్నాయంటూ అవేదన వ్య క్తం చేశారు. ప్రభుత్వం అనేక చట్టాల ను ప్రవేశపెడుతున్నా అవి ఏ మాత్రం ఉపయోగపడడం లేదన్నారు. రాత్రి స మయాలలోనే కాకుండా పట్టపగలు కూడా మహిళలపై దాడులు జరగడం దారుణమన్నారు. నిపుణులు, మేధావు లు, రాజకీయ విశ్లేషకులు, మహిళల ర క్షణపై కట్టుదిట్టమైన చర్యలు, చట్టాలు తీసుకురావాల్సి ఉందన్నారు. సమావేశంలో పాలపర్తి భారతి, దాట్ల అన్నపూ ర్ణ, బొబ్బిలి పద్మిని, ఉమాదేవి, తిరువీ ది వరలక్ష్మి, ప్రమీల, శశికళ, కాళహస్తి సరోజిని, జీర్రెడ్డి నాగలక్ష్మిపాల్గొన్నారు.