April 13, 2013
బాబుకు రెండు రోజులు విశ్రాంతి
సోమవారం పాదయాత్ర పునఃప్రారంభం
బాబు అరికాళ్ల మంటతో బాధపడుతున్నారు : వైద్యులు
విశాఖపట్నం:రెండు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. "వస్తున్నా..మీకోసం''
పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన చంద్రబాబు ప్రస్తుతం
శరభవరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు ఇవాళ, రేపు
పాదయాత్రకు విరామం ప్రకటించారు.
ప్రస్తుతం విరామం తీసుకోకపోతే చంద్రబాబుకు ఆ తర్వాత మరిన్ని చిక్కులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమస్యకు విరామమే పరిష్కారమని వారు చెప్పారు. అందుకు అతి కష్టం మీద బాబు అంగీకరించారు. సోమవారం పాదయాత్ర పునఃప్రారంభించినా, ఆయన తారు, సిమెంటు రోడ్డుపై గాక రోడ్డు ప్రక్కన మట్టి మార్గంలో నడవడం మేలు అని వారు సూచించారు.
: కాలి నొప్పితో బాధపడుతున్న టీడీపీ అధినేత
చంద్రబాబునాయుడుకు డాక్టర్లు శనివారం ఉదయం మరోసారి వైద్యపరీక్షలు
నిర్వహించారు. బాబు అరికాళ్ల మంటతో బాబు బాధపడుతున్నారని వైద్యులు
తెలిపారు, చీలమండ దగ్గర వాపు వచ్చిందని, ఈ వాపు వల్ల రక్తప్రసరణ సమస్య
తలెత్తుతోందని ఆర్థోపెడిక్ డాక్టర్లు చెప్పారు.ప్రస్తుతం విరామం తీసుకోకపోతే చంద్రబాబుకు ఆ తర్వాత మరిన్ని చిక్కులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమస్యకు విరామమే పరిష్కారమని వారు చెప్పారు. అందుకు అతి కష్టం మీద బాబు అంగీకరించారు. సోమవారం పాదయాత్ర పునఃప్రారంభించినా, ఆయన తారు, సిమెంటు రోడ్డుపై గాక రోడ్డు ప్రక్కన మట్టి మార్గంలో నడవడం మేలు అని వారు సూచించారు.
Posted by
arjun
at
5:52 AM