April 14, 2013

తిరుపతిలో టీడీపీ నేతల అరెస్టు

తిరుపతి : చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం పర్యటిస్తున్న సందర్భంగా ఆయన కార్యక్రమాలను అడ్డుకునేందుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నేతలను ముందస్తుగా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్టమలను పోలీసులు అరెస్ట్ చేసి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అయితే వారు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళను దిగారు.