April 14, 2013
ఉద్యమం పేరుతో కోట్లు దోచుకున్న కోదండరాం : మోత్కుపల్లి
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పొలిటికల్
జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ నేత
మోత్కుపల్లి నర్శింహులు ఆరోపించారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో
జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో
మాట్లాడుతూ లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న కోదండరామ్ విద్యార్థులకు
పాఠాలు చెబుతున్నారా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు.
అంబేద్కర్ జయంతి సభలో కూడా టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయించారని, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు తాము వ్యతిరేకం కాదని మోత్కపల్లి చెప్పారు. మాదిగ, మాలల్లో అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంబేద్కర్ జయంతి సభలో కూడా టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయించారని, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు తాము వ్యతిరేకం కాదని మోత్కపల్లి చెప్పారు. మాదిగ, మాలల్లో అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Posted by
arjun
at
4:01 AM