April 14, 2013

బాబు పాలన కోరుకుంటున్న ప్రజలు

తాడేపల్లిగూడెంటౌన్ : రాష్ట్రంలో అవినీతి కుంభకోణాలను నిర్మూలించి నీతివంతమైన పాలన రావాలంటే చం ద్రబాబు నాయకత్వం కావాలని ప్రజ లు కోరుకుంటున్నారని తెలుగుదేశం రాష్ట్రనాయకుడు మాగంటి మురళీమోహన్ అన్నారు. తాడేపల్లిగూడెం న ర్సింహరావుపేటలోని శ్రీ విశ్వదురే ్గశ్వ రి ఆలయాన్ని శనివారం సందర్శించా రు. అమ్మవారికి ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పా లనలో రాష్ట్రం అ«థోగతి పాలైందన్నా రు. అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం 12వ స్థానానికి దిగజారిందని దుయ్యబట్టారు. మంత్రులే అవినితీ కుంభకోణాల్లో కేసులు ఎదుర్కొనడం దేశంలొనే తొలిసారన్నారు. వి ద్యుత్ ఛార్జీలను భారీగా పెంచి సా మాన్య ప్రజలు, రైతులపై పెనుభారం మోపిందని విమర్శించారు.

అన్ని రం గాల్లోనూ రాష్ట్రం వెనుక బడిందన్నా రు. రాష్ట్రంలో నీతివంతమైన పాలన నెలకుని అభివృద్ధి ప«థంలో పయనించాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా విద్యుత్ కోతలు విధించి భారీగా చార్జీ లు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల న డ్డి విరిచించన్నారు. రాష్ట్రన్ని ప్రగతి ప«థంలో నడిపించేందుకు చంద్రబాబు పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా పలువు రు మహిళలు తమ సమస్యలను మురళీమోహన్, సీతారామలక్ష్మిలకు ఏకరువు పెట్టారు.

కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జి ముళ్ళపూడి బాపిరాజు, టీవీ నటుడు సాయిరామ్, రాష్ట్ర కార్యదర్శి కిల్లాడి ప్రసాద్, ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వరావు, పట్టణ అధ్యక్షుడు గొర్రెల శ్రీధర్ మం డల అధ్యక్ష కార్యదర్శులు కోరశిఖ ము నేశ్వరావు, నిరంజన్, యువత జిల్లా నాయకుడు పద్మనాభుని మురళి మో హన్‌గుప్త, పట్టణాధ్యక్షుడు కృష్ణమోహన్, నియోజకవర్గ యువనాయకు డు పసల కొండ, పసుమర్తి రాంలక్ష్మ ణ్, డీసీసీబీ డైరెకర్ట్ దాస రి అప్పన్న, సూరపురెడ్డి నాగేశ్వరావు, ఎరుబండి సతీష్, తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు కొండ్రెడ్డి హైమవతి, తదితరులు పాల్గొన్నారు.