April 14, 2013

'విద్యుత్ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం'

నల్లజర్ల: విద్యుత్తు సమస్యలను వెం టనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీడీపీ నాయకుడు మాగంటి మురళీమోహన్ అన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కా రం కోరుతూ నల్లజర్లలో శనివారం ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేపట్టా రు. ర్యాలీగా విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. ఏడీఈ ఓంకార్, ఏఈ నరసయ్య ఉన్న తాధికారులతో మాట్లాడారు. మెట్ట ప్రాంత రైతులకు ఏడుగ ంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాచేయాలని అప్రకటిత కరెంట్ కోతలకు స్వస్తి చెప్పాలని, విద్యుత్త చార్జీలను వెంటనే తగ్గించాలని నాయకులు డిమాండ్ చే శారు. మురళీమోహన్ నేరుగా విద్యుత్ ఎస్ఈతో ఫోన్‌లో మాట్లాడారు. రోజుకు 7 గంటల కరెంటును రెండు దపాలుగా ఇస్తానని ఎస్ఈ హా మీ ఇవ్వడంతో ఆందోళన విరమించా రు.

కొవ్వూరు ఎమ్మెల్యే టీవి రామారావు, తాడేపల్లిగూడెం ఇన్‌చార్జ్ ముళ్లపూడి బాపిరాజు, నల్లజర్ల మండల అ ధ్యక్షులు ఎస్‌కే మీరా, కార్యదర్శి కూచిపూడి భాస్కరరావు, గోపాలపురం, ద్వారకాతిరుమల, దేవరపల్లి మండల టీడీపీ అధ్యక్షులు గద్దే హరిబాబు, వడ్లమూడి ప్రసాద్, సుంకర దుర్గారావు, కొయ్యలమూడి చినబాబు, ఏపూరి దాలయ్య, ముప్పిడి వెంకటేశ్వరరావు, సొసైటి అధ్యక్షులు ముప్పిడి వెంకటేశ్వరరావు, అల్లాడ రాజారావు, శ్రీను, మాజీ సర్పంచ్ మల్లిపూడి కృష్ణారావు, దాసిన సత్యనారాయణ, తలంశెట్టి చినవెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమలకు చెందిన 30 మందికి మురళీమోహన్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.