April 26, 2013
2014లో చంద్రబాబే సీఎం
కాకినాడ సిటీ: కాకినాడ పార్లమెం టు
స్థానంలో టీడీపీ అభ్యర్థిగా తనను రాష్ట్రపార్టీ పరిశీలిస్తుందని ఆ పార్టీ
రాష్ట్ర తెలుగుమహిళ ప్రచార కార్యదర్శి మాకినీడి శేషుకుమారి ఆశాభావం వ్యక్తం
చేశారు. గురువారం ఆమె మాట్లాడా రు. పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు ఎంపీగా
పోటీచేసేందుకు సిద్దంగా ఉన్నానని, తనకంటే మరిత సమర్ధవంతమైన అభ్యర్థిని
పార్టీ నిలబెట్టినా టీ డీపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానన్నారు.
పార్టీ బలోపేతానికి అం కితభావంతో పనిచేస్తానని శేషుకుమారి తెలిపారు.
చంద్రబాబు పాదయాత్ర రాష్ట్రంలో అన్నివర్గాలను కదిలించిందన్నారు. పాదయాత్ర
ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు
50రోజులుపైగా నడిచానన్నారు. కష్టాల్లో ఉన్న ప్ర జలను ఆదుకోవాలనే సంకల్పం పాదయాత్రతో ఏర్పడిందన్నారు.
50రోజులుపైగా నడిచానన్నారు. కష్టాల్లో ఉన్న ప్ర జలను ఆదుకోవాలనే సంకల్పం పాదయాత్రతో ఏర్పడిందన్నారు.
బాబును మహిళలు ఆదరిస్తున్న వైనం చూస్తుం టే ఎందుకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టామా అన్న ఫీలింగ్ కనిపించిందన్నా రు. 2014లో చంద్రబాబే సీఎం అనే విషయం అందరిలో వ్యక్తమవుతుందన్నారు. తనభర్త వరప్రసాద్ హైదరాబాద్లో ప్రైమ్ ఆస్పత్రి డైరెక్టర్గా ఉ న్నారని, ఇక్కడి ప్రజలకు సూపరిచితులని, పేదలకు వైద్యసేవలు చేస్తున్నామన్నారు. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయినప్పటికీ తమకు టీడీపీతో, జిల్లా నేతలతో ఉన్న సత్సంబంధాలతో పార్టీ ని అధికారంలో తె చ్చేందుకు కృషి చేస్తున్నానన్నారు. 27న విశాఖ సభ విజయవంతానికి తనవంతు ఏర్పాట్లు చేస్తున్నానన్నారు.
Posted by
arjun
at
8:02 AM