April 26, 2013

పాదయాత్ర ముగింపు సభకు భారీ ఏర్పాట్లు

విశాఖపట్నం

ముగింపు సభకు దాదాపు 5 లక్షల మంది రానున్నట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణంలో మహాత్మాగాంధీ, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, ఎన్.టి. రామారావు, ఎర్రన్నాయుడు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ ముగింపు సభలోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చంద్రబాబు వెల్లడించనున్నారు.
: 207 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర శనివారంతో ముగియనుంది. దీంతో ముగింపు సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున విశాఖలో ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 250 మంది నేతలు కూర్చునే విధంగా భారీ స్టేజీని ఏర్పరుస్తున్నారు. ఈ ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు విజయస్థూపాన్ని(పైలాన్) ఆవిష్కరించనున్నారు.