April 26, 2013
చంద్రబాబు కుటుంబసభ్యుల ఆత్మీయ సమావేశం
విశాఖపట్నం
: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన
'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర శనివారంతో ముగియనుండడంతో శుక్రవారం నాడు
విశాఖలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 207 రోజుల పాటు తనతో
పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలు, సిబ్బందితో ఆయన కుటుంబసభ్యులు ఆప్యాయంగా
ముచ్చటించారు. ఈ సమావేశంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోక్శ్
పాల్గొన్నారు. కార్యకర్తలకు, సిబ్బందికి స్వయంగా చంద్రబాబు, భువనేశ్వరి
భోజనాలు వడ్డించారు. కార్యకర్తలందరినీ పేరు పేరునా పలకరిస్తూ, ఫొటోలు
దిగారు. పాదయాత్ర కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు
తెలియజేశారు.
Posted by
arjun
at
7:40 AM