April 26, 2013

చంద్రబాబు కుటుంబసభ్యుల ఆత్మీయ సమావేశం

విశాఖపట్నం
: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర శనివారంతో ముగియనుండడంతో శుక్రవారం నాడు విశాఖలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 207 రోజుల పాటు తనతో పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలు, సిబ్బందితో ఆయన కుటుంబసభ్యులు ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సమావేశంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోక్‌శ్ పాల్గొన్నారు. కార్యకర్తలకు, సిబ్బందికి స్వయంగా చంద్రబాబు, భువనేశ్వరి భోజనాలు వడ్డించారు. కార్యకర్తలందరినీ పేరు పేరునా పలకరిస్తూ, ఫొటోలు దిగారు. పాదయాత్ర కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.