March 24, 2013
బాబు చెప్పిన పిట్లకథ
రాజమండ్రి: అవినీతిపరులను
పార్టీ చేర్చుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జగన్ గురించి తెలుగుదేశం
పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కడియం శనివారం ఒక పిట్టకథ
చెప్పారు.అనగనగా ఒక ఊళ్లో ఒక యజమానివద్ద ఒక గుర్రం ఉండేది.యజమానికి
నమ్మకంగా ఉండడం దాని పని.కానీ ఒక రోజు ఒక దొంగ వచ్చాడు.ఇంట్లో ఉన్న
సొత్తంతా దోచేస్తున్న సమయంలో గుర్రం ఏమీ అనకుండా మౌనంగా
ఉండిపోయింది.అంతేకాక దొంగ వద్దకు వచ్చి, తాను కూడా సహకరిస్తానని, తనను
నీకూడా తీసుకుని వెళ్లాలని కోరింది.
అదేంటి, ఎందుకు అలా చేస్తున్నామని దొంగ అడిగాడు. కానీ యజమాని మంచివాడు కాదని,క్రమశిక్షణంగా ఉండాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పింది. దానితో దొంగ స్పందిస్తూ ఇంతకాలం నిను నమ్మిన యజమానికే మోసం చేశావంటే,తర్వాత నాపని కూడా అంతేకదా అని, గుర్రాని వదిలేసి వెళ్లిపోయాడు.కానీ జగన్కు ఈదొంగకు ఉన్న బుద్ధికూడా లేదని చంద్రబాబు అన్నారు. పెంచి పోషించిన పార్టీలను వదిలి వస్తున్న వాళ్లకు తిరిగి డబ్బులు ఇచ్చి,పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు.
Posted by
arjun
at
5:35 AM