March 19, 2013

ఏప్రిల్ 19న పాదయాత్రను ముగించనున్న చంద్రబాబు

ప.గో: ఏప్రిల్ 19 న పాదయాత్రను ముగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఏప్రిల్ 19 నాటి కి బాబు పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏప్రిల్ 19న విశాఖ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 20న విశాఖలో జన్మదిన వేడుకలు జరుపుకున్న అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు.