March 19, 2013
ప్రోత్సహిస్తే 7వేల కిలోమీటర్లయినా పాదయాత్ర చేస్తా
తిరిగి అటువంటి పూర్వ వైభవం తీసుకు రావాలన్నారు. ప్రజల సమస్యలు విం టుంటే కళ్లవెంట నీరు వస్తున్నాయని ప్రతి కుటుంబం తమ బాధలను వ్యక్త పరుస్తోంది. గతంలో వృద్ధులకే పింఛన్ వచ్చేదని ప్రస్తుతం యువ కులకు కూడా పింఛన్ ఇస్తున్నారంటే ఎంత «ధౌర్భాగ్యమో ప్రజలు ఆలో చించాలన్నారు. కరెంటు వైరు పట్టు కుంటే షాకు కొడుతోంది కాని ప్రస్తు తం కరెంటు బిల్లులు చూస్తూనే షాక్ కొడుతుందన్నారు.
నిత్యావసర ధర లు, పెట్రోలు, డీజిల్ వంటి ధరలను పెంచి ప్రజలపై మరింత భారాన్ని మోపుతోందన్నారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి దయ నీయంగా ఉందని, నీరు లేక విద్యుత్ సక్రమంగా లేక కనీసం తిండి గింజలు కూడా నోచుకోని పరి స్థితి నెలకొం దన్నారు. దీంతో పండగ లకు కు టుంబ సభ్యులను ఇంటికి పిలుచు కోవాలన్నా భయపడే పరిస్థితి నెల కొందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ తథ్యమన్నారు. ఎవ రిని గెలిపిస్తే మనం, మన నియోజ కవర్గం అభివృద్ది చెందుతుంతో ప్రజలు ఆలోచించారు.
ఇప్పటి వరకు 96 గ్రామాలను 33 రోజుల్లో పర్యటించి 730 కి.మీ దూరాన్ని వెంకటేష్ పాద యాత్ర చేశారని ఆయన ఆనునా యులు తెలిపారు. ఈ పాదయా త్రలో వడ్లమూడి ప్రకాష్రావు, కర్నాటి పూ ర్ణచంద్రరావు, పోకూరి బుల్లిబ్బాయి, నాగినేని రామకృష్ణ, మన్నం వెంకటే శ్వర్లు, మువ్వా నారాయణరావు, బేత పూడి వాసు, బత్తిన శ్రీనివాసరావు, చావా రవి, రేగుల వెంకటరావు, పూ నూరి నహేమియా, ఓగూరి రమా దేవి, కొండమ్మ, పాలేటి రమణ, నాగేంద్రమ్మ, ఓగూరి కృష్ణ చైతన్య, కరి చేటి రాంబాబు, తిమ్మన్నపాలెం సొ సైటి అధ్యక్షులు ముసులూరి వెంకట రావు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికువ, పంగులూరు, కొరిశపాడు పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. మంగ ళవారం తిమ్మన్నపాలెం, ఎ ర్రబాలెం, తమ్మవరం, అనమనమూరులో పాద యాత్ర జరుగుతుందని మండల పార్టీ అధ్యక్షులు గోలిహరిబాబు తెలిపారు.
Posted by
arjun
at
6:55 AM