March 19, 2013

వైఎస్ పాలనలో రాష్ట్రం అథోగతి

చిట్టమూరు: వైఎస్ పాలన లో రాష్ట్రం అధోగతి పాలయింద ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యు డు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం చిట్టమూరులోని గణపర్తి మా ర్కెండేయనాయుడు ప్రాంగణం లో జరిగిన పార్టీ కార్యకర్తల స మావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని అన్నారు. ఇంత చేసినా నేడు షర్మిల పాదయాత్ర చేస్తూ టీడీపీ ని విమర్శించడం ఘోరమన్నారు.

పేదల కడుపుకొట్టి.. పనబాక కృష్ణయ్య గూడూరు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తూ పేదల కడుపుకొట్టి పెద్దలకు పంచిపెడుతున్నాడని ఆయన దుయ్యపట్టారు. గూడూరు సబ్ కలెక్టర్‌కు ఫ్రొటోకాల్ తెలియదని, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నా, ఓడిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో టీడీపీ జిల్లా అ««ధ్యక్షుడు బీద రవిచం ద్ర, గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాద్‌రావు, గూడూరు పరిశీలకులు గూడూరు రఘునాథరెడ్డి, నాయకులు మస్తాన్‌రెడ్డి, ఉక్కుజనార్దన్, సుబ్బరామయ్య, కిషోర్‌నాయుడు, వీరాస్వామినాయుడు, గోపాల్‌రెడ్డి, రత్నమ్మ, గోపాల్‌నాయుడు పాల్గొన్నారు.