March 19, 2013

ఒక పనైపోయింది బాబూ!

ఏలూరు :ఇప్పటి వరకూ పార్టీ అభ్యర్థుల విషయంలో ఎలాంటి ప్రకటనా చేయని పార్టీ అధినేత చంద్రబాబు మంగళవారం జరిగిన పోలవరం నియోజకవర్గ సమీక్షలో మన లోక్ సభ అభ్యర్థి మాగంటి బాబు అంటూ రెండు, మూడుసార్లు ప్రస్తావించారు. పార్టీలో సమన్వయ లోపాన్ని ఎత్తి చూపిన తర్వాత మాగంటి బాబు లోక్‌సభకు పోటీ చేస్తాడు...అప్పుడు కూడా మీరిలాగే ఉంటే ఓట్లు ఎలా వస్తాయంటూ నిలదీశారు. రాష్ట్రంలో మనం అధికారంలోకి రావడమే కాకుండా ఎంపీలను కూడా గెలిపించుకోవాలి... ఇక్కడ బాబు గెలుపుకోసం ఐకమత్యం అవసరం... మీరంతా ఇలా గ్రూపులు ముఠాలంటే ఎలా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన మాటల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాగంటి బాబు పార్టీ అభ్యర్థి అన్నట్టుగానే ప్రస్తావించారు.