February 6, 2013

చేతకాని పనులు ఎందుకు!?: టీడీపీ

కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా మొదలుపెట్టిన ప్రతి పథకమూ చివరకు అట్టర్‌ఫ్లాప్ అవుతోందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఆధార్ కార్డులు కూడా ఇవ్వలేక ప్రజలు రోడ్డెక్కే పరిస్థితిని తీసుకు రావడం దారుణమని, చేతగాని పనులు పెట్టుకొని ప్రజలను హింసించడం ఎందుకని తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆధార్ కార్డులు సవ్యంగా ఇవ్వలేనప్పుడు.. చాలినన్ని కేంద్రాలను పెట్టలేనప్పుడు ప్రతి పథకాన్ని దానితో అనుసంధానించడం ఎందుకని ప్రశ్నించారు.