February 6, 2013

నాడు ఎన్టీఆర్..నేడు చంద్రబాబు

సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఎన్టీఆర్... నేడు చంద్రబాబు తాడేపల్లిలోని సాయిబాబా గుడి ఎదుటి ప్రాంతంలో భోజనానికి ఉపక్రమించడం విశేషం. 1983లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు తాడేపల్లి మీదుగా వస్తూ సాయిబాబా గుడి ఎదురు ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అనంతరం అక్కడే కొద్దిసేపు విశ్రమించి భోజనం చేశారు. 30 ఏళ్ల అనంతరం దేశం అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలో భాగంగా తాడేపల్లి సాయిబాబా గుడి ఎదురు ఖాళీ స్థలంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకోనున్నారు.

సిద్ధం చేస్తున్న ప్రాంగణం చంద్రబాబునాయుడు జిల్లా పర్యట నకు సంబంధించి ఉదయం 10:30 గంటల సమయంలో ప్రకాశం బ్యారేజీ వద్దకు రాగానే దేశం జిల్లా నేతలు భారీ గా స్వాగతం పలకనున్నారు. బాబు సీతానగరం, ఉండవల్లి సెంటరు, తాడేపల్లి పట్టణం, సాయిబాబా మందిరం ఏర్పాటు చేస్తున్న భోజన వసతి ప్రాంగణానికి వచ్చి విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం నులకపేట, డోలాస్‌నగర్ మీదుగా డా న్‌బోస్కో హైస్కూల్, మంగళగిరి చేరుకుంటారు. తాడేపల్లి పట్టణ, మండల దేశం నేతలు సాయిబాబా మందిర ఎదుట ఉన్న ప్రాంగణాన్ని జేసీబీలతో చదును చేయిస్తున్నారు. కాగా, చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేయాలని మండల దేశం అధ్యక్షులు పఠాన్ ఖాశీంఖాన్, పట్టణ దేశం అధ్యక్ష, కార్యదర్శులు మేకా పుల్లారెడ్డి, కొర్రపాటి రమణ కోరారు.