February 13, 2013

లక్ష కోట్లు దోచాడనా.. వైఎస్‌కు లక్ష విగ్రహాలు?

వాళ్లు నీతిమంతులా?
అలా అంటే మల మూత్రాలు పడేలా తంతారు!
నా ఇల్లు, జగన్ ఇల్లు చూసి..
అవినీతిపరులెవరో తేల్చండి
అసలు ఈయనేం ముఖ్యమంత్రో?
రాష్ట్రానికి 'కాంగ్రెస్' చెదలు వదిలించాలి
తొలి రోజే వస్త్ర వ్యాపారాలపై వ్యాట్ ఎత్తివేస్తా
రెండు వేల కిలోమీటర్ల నడక పూర్తి

" దేశ స్వాత్రంత్యం కోసం మహాత్మాగాంధీ, రాజ్యాంగం కోసం అంబేద్కర్, తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్‌టీఆర్ చేసిన త్యాగాల గుర్తుగా వారి విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్నాం. కానీ, రూ.లక్ష కోట్లు కొడుక్కి దోచి పెట్టిన వైఎస్‌కు లక్ష విగ్రహాలు పెట్టడం ఇదెక్కడి నీచం? వైఎస్‌ను ఎవరూ ఆదర్శంగా తీసుకోకూడదు. నేను నీతిగా ఉంటూ నిప్పులా బతుకుతున్నాను. తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు నీతిగా ఉన్నామని చెబితే వాళ్ల బట్టలూడతాయి. బట్టల్లోనే మలమూత్రాలు వదిలేలా ప్రజలు తరిమి కొడతారు''
- గుంటూరు జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

మహాత్మాగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ వంటి ఎందరో చేసిన త్యాగాల గుర్తుగా వారి విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్నాం. అలాంటిది రూ.లక్ష కోట్లు కొడుక్కి దోచిపెట్టిన వైఎస్‌కు లక్ష విగ్రహాలు పెట్టడం ఇదెక్కడి నీచం?'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్‌ను ఎవరూ ఆదర్శంగా తీసుకోరాదని కోరారు. కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో ర్రాష్టానికి చెదలు పట్టిందని, సర్వనాశనం చేస్తున్న ఆ పార్టీని పూర్తిగా వదిలించుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పట్టణం ఏటుకూరు రోడ్డు డీఎస్ నగర్‌లో మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పట్టణంలోని ఎన్టీఆర్ ఐలాండ్ వద్ద 2000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు.

అంతే.. ఒక్కసారిగా రాష్ట్రమంతటా టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆనందోత్సాహాల్లో తేలిపోయా రు. పసుపురంగు బెలూన్లు, ఆకాశదీపాలను గాలిలోకి వదిలారు. భారీ కేక్‌ను చంద్రబాబుతో కట్ చేయించి సం బరాలు చేసుకొన్నారు. అధినేత ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేయించారు. పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లోనూ పండగ వాతావరణం నెలకొంది. యాత్రలో భాగంగా ప్రజల కష్టసుఖాలు విచారించారు. జగన్, సీఎం కిరణ్‌లపై విరుచుకుపడ్డారు. "హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జగన్ ఇల్లు, జూబ్లీహిల్స్‌లో నా ఇల్లు చూడండి. ఎవరు అవినీతిపరులో మీరే తేల్చండి. ఏటా నా కుటుంబ ఆస్తులు ప్రకటిస్తున్నాను. కానీ, నాకు సింగపూర్‌లో హోటల్ ఉందన్నారు. ఎక్కడుందో చూపిస్తే రాసిస్తానని సవాలు విసిరితే తోక ముడిచారు'' అని ఎద్దే వాచేశారు. ఈయనేమి ముఖ్యమంత్రో అర్థం కావడం లేదని కిరణ్‌ను దుయ్యబట్టారు.

"ఈ కిరికిరి సీఎం రూపాయికి కేజీ బియ్యం అన్నాడు. మొన్న సన్నబియ్యం రూపాయికే అన్నాడు. మరునాడే మాటమార్చి మంచి బియ్యం అని చెప్పాడు. అంటే ఇప్పటిదాకా ఇచ్చింది చెడ్డబియ్యమేకదా?'' అన్నారు. ఆడపిల్లల హ క్కులు, రక్షణ బాధ్యత తీసుకొంటానని వాగ్దానం చేశారు. కామాంధులకు ఉరి శిక్ష వేయిస్తానని పునరుద్ఘాటించారు. బెల్టుషాపులకు తలుపులు తెరిచి ఆడబిడ్డల మంగళసూత్రాలతో ఈ ప్రభుత్వం ఆడుకొంటోందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కరెంటు బాంబులేసి 10 లక్షల చిన్న పరిశ్రమలను దివాలా తీయించిం దన్నారు.

లక్షలమంది పొట్ట కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశా రు. తాను నీతిమంతమైన పాల నతో జవాబుదారీగా నిలిస్తే వైఎ స్ రాక్షసపాలనగా మార్చేశాడని నిప్పులుచెరిగారు. బెంగళూరు, లోటస్‌పాండ్, ఇడుపులపాయ, పులివెందుల, కడప, చెన్నైలో ప్యాలెస్‌లు నిర్మించి, వాటిని దె య్యాలు కాపురం ఉండే కొంపలుగా తయారుచేశారన్నారు. వస్త్ర వ్యాపారంపై వ్యాట్‌ను అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఎత్తివేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రూ.20-30 లక్షల మధ్య టర్నోవర్ ఉన్నవారికి సెల్ఫ్ అసెస్‌మెంట్ అమలు చేస్తానన్నారు. ఎఫ్‌డీఐలతో 4కోట్ల మంది చిరు వ్యాపారుల జీవితాలు చితికిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.

19న విరామం
గుంటూరు, కృష్ణాజిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల నేపథ్యంలో కోడ్ కారణంగా 19న సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు పాదయాత్రను వేమూరు నియో జకవర్గంలో నిలిపేస్తారు. తిరిగి 21 సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారు. దీంతో 17న ఆదివారం విరా మం ఉండదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లా రావు తెలిపారు. కాగా, చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ ని అధికారంలోకి వస్తే అమలు చేస్తామని పార్టీ నేత దాడి వీరభద్ర రావు హైదరాబాద్‌లో ప్రకటించారు.