May 28, 2013

అవినీతిని కాంగ్రెస్ మ్యానిఫెస్టోగా మార్చింది : బాలకృష్ణ

అవినీతిని కాంగ్రెస్ మ్యానిఫెస్టోగా మార్చిందని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అవినీతి సుడిగుండంలో చిక్కుకుందని హీరో బాలకృష్ణ దుయ్యబట్టారు. రెండో రోజు మహానాడులో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ టీడీపీది అభివృద్ధి వాదం...కాంగ్రెస్‌ది అవినీతి వాదం అని ఆరోపించారు. టీడీపీ మహావృక్షం....దాని కింద వందల పురుగులు పుట్టాయని, అవి ఇప్పుడు వెళ్లిపోతున్నాయని బాలయ్య తెలిపారు.

పార్టీ నేతలు గ్రూపులను ప్రక్కనబెట్టి పనిచేయాలని కోరారు. చంద్రబాబు పాదయాత్ర ఫలితం ప్రజలకు అందజేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఎన్టీఆర్ తెలుగు గడ్డపై పుట్టడం మనందరి అదృష్ణమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 1982 నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని బాలకృష్ణ పేర్కొన్నారు