May 28, 2013

డల్లాస్‌లో ఎన్టీ ఆర్ జయంతి

అమెరికాలోని డల్లాస్‌లో మంగళవారం టిడిపి ఆధ్వర్యంలో ఎన్టీ ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటుడు మురళీ మోహన్ కేక్ కట్ చేశారు. టిడిపి రాష్ట్ర
కార్యదర్శి మన్నవ సుబ్బారావు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ టిడిపిని స్థాపించిన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిందని మురళీమోహన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్టీ ఆర్
నటించిన పలు సినిమాలకు చెందిన పోస్టర్లను మురళీమోహన్ ఆవిష్కరించారు. నరసరావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ని
వాళులు అర్పించారు. ఈ
సందర్భంగా ఎన్నారైలు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్నారైలు సతీష్ వేమన, ఉప్పుటూరి రామ్ చౌదరి, చెన్నుపాటి రామ్ కిశోర్, నవత కృష్ణ, చెరుకూరి బుల్లయ్య, విశాఖకు చెందిన ఎన్‌టి చౌదరి,
న్యాయవాది మోదుగుల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.