May 28, 2013
మళ్లీ ఆ రోజులు పునరావృతమవుతాయన్న బాలయ్య!
తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ మహానాడు రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా బాలయ్య ప్రసంగించారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని, అన్ని వర్గాలు, మతాలకు తెలుగుదేశం సమప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయాల్లో, సినిమాల్లో ఆదర్శప్రాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు.
ఇక కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు. నాన్నగారి ఆశయాలను సాదించడానికి తెలుదేశం పార్టీ కృషి చేస్తోందన్న బాలయ్య ప్రస్తుతం రాష్ట్రం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది కాంగ్రెస్ పై మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలవద్దకు పాలన, సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడ్డాయన్నారు.
ఎన్టీఆర్ ఈ గడ్డ మీద పుట్టడం మన అదృష్టమన్న బాలయ్య ప్రజల కోసమే ఆయన స్థాపించిన టిడిపి వెనుకబడిన వర్గాల వారికి టిడిపి అండగా ఉంటందన్నారు. వచ్చే ఎన్నికల్లో 1982 నాటి పరిస్థితులు పునరావృతమయి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వెనుకబడిన వర్గాల వారి పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు టిడిపి వల్లే వారికి మేలు జరిగిందన్నారు.
Posted by
arjun
at
4:08 AM