April 11, 2013
కరెంటు సమస్యపై టీడీపీ సంతకాల సేకరణ
బంట్వారం : రాష్ట్రంలో గతంలో
ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని, విద్యుత్ సక్రమంగా
సరఫరా చేయకున్నా ప్రభుత్వం విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం
మోపుతుందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్యాదవ్ అన్నారు.
బుధవారం మండల కేంద్రంలో విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా సంతకాల సేకరణ
నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్యాదవ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో
అప్పుడప్పుడు మాత్రమే కరెంటు ఉండేది కాదని, ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో
అప్పుడప్పుడు మాత్రమే కరెంటు ఉంటోందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం ప్రజలే నేర్పుతారని ఆయన అన్నారు.
కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పి.విజయ్కుమార్, మండల టీడీపీ
నాయకులు లింగయ్య, అంజిల్రెడ్డి, రామ్ప్రసాద్, శ్రీకాంత్, పాపిరెడ్డి,
శ్రీనివాస్రెడ్డి, శేఖర్, నర్సింహులు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
Posted by
arjun
at
6:09 AM