April 11, 2013

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి

ములుగు,ఏప్రిల్ 9: రైతులకు విద్యుత్ అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలని టీడీపీ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు అ న్నారు. మంగళవారం ములుగు మం డలం వంటిమామిడిలో టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తల ధర్నాలో దయాకర్‌రావు పాల్గొని మా ట్లాడుతూ ప్రభుత్వానికి విద్యుత్‌పై ముందుచూపు లేకపోవడంతో రైతులకందరికీ కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయని ఆయన అన్నారు. రైతు ప్రభుత్వ మని చెప్పుకునే కాంగ్రెస్ అన్నదాతల కు విద్యుత్ అందించడంలో పూర్తిగా విఫల

రైతులు వేసుకున్న పంటలు పూర్తిగా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశ ప్రభుత్వ హాయంలో తొమ్మిది ఏళ్లు కరువు ఏర్పడినప్పటికీని 9 గంటల క రెంటు ఇచ్చి రైతులను ఆదుకున్న ఘన త టీడీపీకే దక్కిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశ ప్ర భుత్వ హాయంలో జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత ప్రభుత్వం అవినీతిలో కూరకపోయి మంత్రులు, ఐఏఎస్ అధికారులు జైలు కూడు తింటున్నారని ఆ రోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తు న్న అవినీతి అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రాఆన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని ప్రకటించి తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఇదేఅదునుగా టీఆర్ఎస్ పార్టీ కూడా సొంతలాభం చూసుకుని ప్రజ ల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే తె లంగాణ ప్రజలు కష్టాలు తీరుతాయన్నారు. రాష్ట్ర సాధన కోసం తెలుగుదే శం పార్టీ స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నామన్నారు. కేంద్రప్రభుత్వం వెం టనే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనియేడల వచ్చే ఎ న్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంతంలో కళ్లు తెరిపించే విధం గా ప్రజలు తీర్పిస్తారని హెచ్చరించా రు. వెంటనే రైతులకు న్యాయమైన క రెంటు అందించి ఆదుకోవాల్సిన బా ధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని ఆ యన డిమాండ్ చేశారు. సమావేశం లో మండల పార్టీ అధ్యక్షుడు గంగిశెట్టి గణేష్, పెంటయ్య, బాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశం,శేఖర్, నర్సింలు, లక్ష్మణ్‌గౌడ్, మహేష్‌యాద వ్, బాబుగౌడ్, చాకలి దశరథ, యువ త అధ్యక్షుడు కనకయ్య, అనంతరెడ్డి, నర్సింహ్మారెడ్డి, మాధవరెడ్డి, కురమ రా జయ్యతోపాటు కుమార్‌గౌడ్, వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మయ్యిందన్నారు.