March 21, 2013
అంతా పసుపుమయం
దేవీచౌక్ చంద్రబాబుకు
స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్ళు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు.
చంద్రబాబు పర్యటించే ప్రాంతాలతో పాటు నగర మంతా టీడీపీ జెండాలతో నింపేశారు.
చంద్రబాబుకు ముందు పసుపు రంగుల చిచ్చుబుడ్డులు ఏర్పాటు చేశారు. పసుపు
బుడగలు, గాలిలో ఎగిరే విధంగా ఏర్పాటు చేశారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున
టీడీపీ జెండాలు చేతపట్టి చంద్రబాబుకు స్వాగతం పలికారు. యువకులు
ద్విచక్రవాహనాలపై సందడి చేశారు. కొండరు కార్యకర్తలు కొవ్వూరు, రాజమండ్రికి
బైక్ ర్యాలీతో హల్చల్ చేశారు.
దేవీచౌక్ : రాజమండ్రి మెయిన్ మార్కెట్లోకి ప్రవేశించిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. షాపులో పని చేసే మహిళలు, మార్వాడీలు చంద్రబాబుకు హారతులు పట్టారు. చంద్రబాబును చూడటానికి ఆసక్తి చూపారు. ఒక్కసారి మాట్లాడాలని కోరడంతో చంద్రబాబు వారివద్దకు వెళ్ళి పలకరించారు. వాళ్ళ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Posted by
arjun
at
5:41 AM