March 21, 2013

రాజమండ్రికి మురళీమోహన్.. అమలాపురానికి గొల్లపల్లి

రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు రాజమండ్రి అమలాపురం పార్లమెంట్ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. రాజమండ్రికి ఇప్పటికే ప్రజల్లో పనిచేస్తున్న ప్రముఖ సినీ నటుడు మాగంటి మురళీమోహన్‌ను పేరును గతంలోనే ఖరారు చేశారు. కాగా, అమలాపురం లోక్‌సభ నియోజక వర్గానికి గొల్లపల్లి సూర్యారావును ఇన్‌చార్జిగా నియమించారు.

అంతేకాక ఆయనే పార్టీ అభ్యర్థి అని ప్రకటించారు. రాజమండ్రిలో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని వెల్లడించారు. సూర్యారావు కు మాజీ మంత్రిగా అనుభవం ఉండడమే కాక పలుకుబడి, సమర్థత ఉన్న నాయకుడన్నారు. బాలయోగిలా ధైర్యంగా పనిచేయాలని సూర్యారావుకు సూచించారు.