February 14, 2013

స్పీకర్ నియోజకవర్గ రైతుల గోడు వినాలి : చంద్రబాబు

72 గంటల్లో ప్రభుత్వం సాగునీరు ఇవ్వకపోతే సోమవారం రైతులతో మహాధర్నా చేపట్టనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. గురువారం ఉదయం జిల్లాలోని కొలకలూరు నుంచి 136వ రోజు పాదయాత్రను బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి కోసం రైతలు అలమటిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. స్పీకర్ నియోజకవర్గ రైతుల గోడు వినాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో కూర్చుంటే కుదరదని, రైతుల తరపున పోరాడాలని చంద్రబాబు పేర్కొన్నారు.