September 3, 2013

హైదరాబాదులో సభ ఎందుకు పెట్టుకోనివ్వరు?: సోమిరెడ్డి


రాష్ట్ర రాజధానిలో ఈ నెల 7వ తేదీన తలపెట్టిన ఏపీఎన్జీవోల సదస్సుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

గతంలో టీ కాంగ్రెస్ నేతలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యోగులకు అనుమతి ఇవ్వకపోవడం సరికాదన్నారు. సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటానని చెబుతున్న ముఖ్యమంత్రి కిరణ్ సభ అనుమతికి ఎందుకు అనుమతి ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 60శాతం ఉన్న సీమాంధ్ర ప్రజలకు దీనివల్ల అన్యాయం జరుగుతుందన్నారు.